Tuesday, May 14, 2024
- Advertisement -

భారత్ డబుల్ హ్యాట్రిక్..

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టింది రోహిత్ సేన. దీంతో సెమీస్‌కు మరింత చేరువైంది. భారత్ విధించిన 230 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ కేవలం 129 పరుగులకే ఆలౌట్ అయి దారుణ ఓటమిని మూటగట్టుకుంది.

భారత బౌలర్లు బుమ్రా,షమీ ధాటికి ఏ దశలోనూ కొలుకోలేదు ఇంగ్లాండ్. ఇద్దరు హ్యాట్రిక్ మిస్ చేసుకోవడం విశేషం. మలన్‌ను(16), తర్వాతి బంతికే జో రూట్‌ను(0) ఎల్బీడబ్ల్యూ షాక్ ఇచ్చాడు బుమ్రా. తర్వాత షమీ బెన్ స్టోక్స్‌ను(0),బెయిర్‌స్టో(14) ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేయడంతో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. జోస్ బట్లర్(10) ,లివింగ్ స్టోన్ (27), మెయిన్ అలీ (15) పోరాడినా ఫలితం లేకపోయింది. షమీ 4 , బుమ్రా3 , కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(87), సూర్యకుమార్ యాదవ్(49) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3 వికెట్లు, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -