Tuesday, May 14, 2024
- Advertisement -

బాబ్రి విధ్వంసం కేసులో  బీజేపీ  అగ్ర‌నేత‌ల‌పై కుట్ర జ‌రుగుతోంది

- Advertisement -
Pravin Togadia alleges conspiracy.. lashes out at CBI

1992లో జ‌రిగిన బాబ్రీ మ‌సీదు విధ్వంసం కేసులో  బీజేపీ సీనియ‌ర్‌నేత‌లు ఎల్‌కె అద్వానీ,ముర‌ళీమ‌నోహ‌ర్‌జోషి, ఉమాభార‌తిల‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేసులో వీరంద‌రూ నిర్దోసుల‌ని అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

కేసును విచారించిన సుప్రీం కోర్టు  అల‌హాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును ప‌క్క‌న పెడుతూ పున‌ర్విచార‌ణ చేయాల‌ని తీర్పు చెప్ప‌డంతో  బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌కు షాక్ షాక్ త‌గిలింది. అయితే దీనిపై విశ్వ‌హిందూప‌రిష‌త్ జాతీయ  కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు ప్ర‌తీణ్ తోగాడియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బాబ్రీమశీదు కేసులో బీజేపీ అగ్ర‌న‌త‌ల‌పై కుట్ర‌జ‌ర‌గుతోంద‌ని ఆరోపించారు.ఎల్‌కే అద్వాని,ఉమాభార‌తి,ముర‌ళీమ‌నోహ‌ర్‌జోషీల‌పై  విచార‌ణ‌ను  పున‌రుద్ద‌రించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించ‌డంపై ఆయ‌న స్పందించారు.సీబీఐ వాద‌న‌ను ఖండిస్తూ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును  ఆశ్ర‌యించాల‌న్నారు.కుట్ర కేసును న‌మోదు చేయాలంటే  ముందు బాబ‌ర్ పైనా …భార‌త‌దేశంలో ఉంటున్న వారి వార‌సుల‌పైనా న‌మోదు చేయాల‌ని తోగాడియా డింమాండ్  చేశారు. 

అయేధ్య‌లోని వివాస్పాద  స్థ‌లంలో రామ‌మందిరం నిర్మానంకోసం చ‌ట్టం చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. అద్వానీ ,జోషీల‌ను ఈవ‌య‌సులో జైలు పాలు చేయాల‌నీ ప్రశ్నించారు. అది హిందువుల‌కు అవ‌మాన‌క‌ర‌మ‌న్నారు.. మ‌రోవైపు సీబీఐ మీద కూడా తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తంచేశారు. కేంద్ర ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లో ఉండే సీబీఐ…. హిందువుల‌ను కుట్ర‌దారులని కోర్టు ప్ర‌క‌టించేలా చేసింద‌ని ఆరోపించారు.తోగాడియా వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు ఎలా స్పంద‌స్తారో చూడాలి.

Also Read

  1. మోదీ మైండ్‌గేమ్‌.. అద్వానీకి చెక్
  2. అద్వాని,ఉమాభార‌తిల‌కు సుప్రీం షాక్‌
  3. దిన‌క‌ర‌న్ అరెస్ట్‌కు రంగం సిద్ధం
  4. బాబ్రీ మ‌సీదు విధ్వంస కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేడే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -