మంత్రి భూమా అఖిల ప్రియకు చేదు అనుభవాలు ఎదరవుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల టికెట్ కాన్నుంచి నిన్నజరిగిన మున్సిపల్ కౌనసిల్ సమావేశం వరకు అన్నీ అవమానాలే ఎదురవుతున్నాయి. భూమా …శిల్పా కుంటుంబాల మద్య మరోసారి విభేదాలు తలెత్తాయి.నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇరు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. మంత్రి భూమా అఖిల ప్రియను శిల్పా వర్గీయులు కౌన్సిల్ సమావేశంలో నిలదీశారు. మీ తీరు మర్యాదగా లేదంటూ మండిపడ్డారు.
మంత్రి హోదాలో తొలిసారి కౌన్సిల్ సమావేశానికి హాజరైన భూమా అఖిలప్రియ.. చైర్పర్సన్ సులోచన రాకముందే సమావేశాన్ని ప్రారంభించారు. కాస్త ఆలస్యంగా కౌన్సిల్కు వచ్చిన చైర్పర్సన్కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అఖిలప్రియ. దీంతో తమ వర్గానికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని అఖిలప్రియను సులోచన ప్రశ్నించారు. చైర్పర్సన్ రాకముందే కౌన్సిల్ సమావేశం ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు.వీల్లందరూ శిల్పా వర్గీయులే కావడం గమనర్హం. శిల్పా వర్గానికి చెందిన కౌన్సిలర్లు భూమా అఖిల ప్రియను అవమానించే విదంగా మాట్లాడారు. చైర్పర్సన్ భర్త ,టీడీపీ కో ఆష్ఫన్ మెంబర్ సుధాకర్ రెడ్డి కూడా అఖిలప్రియ తీరుపై మండిపడ్డారు. కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. చైర్పర్సన్కు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీంతో కాసేపు అక్కడే ఉన్న అఖిలప్రియ తాను కర్నూలు వెళ్లాల్సి ఉందని.. మీరే మాట్లాడుకోండి అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ఛైర్ పర్సన్ అనుమతి లేకుండా సమావేశానికి వస్తే ఊరుకొనేదిలేదని హెచ్చరించారు.
మీరు మాట్లాడేసి… చైర్పర్సన్ మాట్లాడే విషయాలు వినకుండా వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి అయి ఉండి ఇలా చైర్పర్సన్ను అవమానించడం ఏమిటని ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్తి కొద్ది రోజుల్లో తేలనుండగా అఖిల ప్రియను శిల్పా వర్గీయులు టార్గెట్ చేయడం ఇప్పుడు కర్నూలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related