అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్ ఎంగెజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి వరకు వెళ్లి.. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ కంటే ఆమె నాలుగేళ్లు పెద్దది అయినా నాగ్ వారి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఎంతో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసాడు. అయితే వీరి ఇద్దరు మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు రావడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.
అసలు వీరిద్దరు విడిపోవడానికి ఓ చిన్న రీజన్ కారణమట. అదేంతో తెలిస్తే.. ఇంత సిల్లి రీజన్ వల్ల విడిపోతారా అని ఆశ్చర్యపోతారు. అసలు విషయంలోకి వెళ్తే.. అఖిల్ మొదటి మూవీ ప్లాప్ కావడంతో అఖిల్ కేరీ పై పునరాలోచనలో పడ్డాడు నాగార్జున. ఎలానో ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి అఖిల్ రెందో సినిమా రిలీజ్ అయ్యాక వీరిద్దరి పెళ్లి చెద్దాం అని శ్రియా ఫ్యామిలీకి చెప్పినట్టు సమాచారం.
ఈ విషయంలో అఖిల్ కూడా ఓకే అన్నాడట. కానీ శ్రియా ఫ్యామిలీ వాళ్లు దీనికి అసలు ఒప్పుకోలేదట. దాంతో పెళ్ళి వెంటనే చెయ్యాలని గట్టిగా డిమాండ్ చేసారట. ఇదే సంగతిలో అఖిల్, శ్రియాకు మనస్పర్దలు పెరిగి విడిపోవడానికి కారణమయ్యాయట. కాగా అఖిల్ తో బ్రేకప్ అయ్యాక శ్రియా ఓ ఎన్నారైతో పెళ్ళికి సిద్దమైందనే వార్తలు వస్తున్నాయి.
{youtube}uFBfnoHrv7U{/youtube}
Related