కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇన్నాల్లు టికెట్టు ఎవరికనే విషయంలో ఉన్న సస్పెన్సన్కు తెరదించారు.మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. త్వరలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.చంద్రబాబుపై శిల్పా నిప్పులు చెరిగారు.
2014లో వైసిపి నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నా సర్దుకుపోయానని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. మంత్రి పదవి ఇచ్చినా ఏమనలేదని అన్నారు. కానీ టిక్కెట్ ఇచ్చే విషయంలో నాన్చుడు ధోరణి వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.టీడీపీలో తమను అడుగడుగునా అవమానిస్తున్నారని, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినా స్పందించలేదన్నారు.
{loadmodule mod_custom,GA1}
కార్యకర్తలు అందరూ ఓకే అన్న అనంతరం శిల్పా డేట్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ నెల 14న జగన్ సమక్షంలో వైసిపిలో చేరుతానని అనుచరులకు చెప్పారు. కార్యకర్తల నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. శిల్పా నిర్ణయంతో నంద్యాలలో టీడీపీకి ఊహించని దెబ్బ అని చెప్పవచ్చు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- రామసుబ్బారెడ్డికి మరో సారి హ్యాండిచ్చిన బాబు
- వైసీపీలో అభ్యర్తుల కసరత్తు ప్రారంభంజ…
- బాబు నంద్యాల ఉప ఎన్నిక టికెట్టు సర్వేలో ఆసక్తికర ఫలితాలు
- ఏకగ్రీవంపై బెడిసి కొట్టిన భూమా అఖిల ప్రియ ప్రయత్నాలు..
{youtube}ISs6a-cQ7NA{/youtube}