Saturday, April 27, 2024
- Advertisement -

ప్రముఖ దర్శకుడి పై సంచలన వ్యాఖ్యలు చేసిన కమెడియన్

- Advertisement -

30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో పాపులర్ అయిన ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నడిపే భక్తి ఛానల్ ఎస్ వి బి ఛానల్ కి కొత్త చైర్మన్గా నియమితమైన సంగతి తెలిసిందే. అంతకుముందు వరకు ఈ స్థానం లో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఉండేవారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఘోర పరాజయం పాలవడంతో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన స్థానం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ స్థానంలో పృధ్విరాజ్ ని ఎంపిక చేశారు.

గత కొంతకాలంగా పృథ్వి వైఎస్సార్సీపీకి సపోర్ట్ చేస్తూ కాంపెయిన్ లలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ పృథ్వి కి చైర్మన్ స్థానాన్ని ఇచ్చారు. అయితే పృథ్వి అప్పటినుంచి టాలీవుడ్ సెలెబ్రిటీల పైన కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారు. వైయస్ జగన్ గెలిచిన తర్వాత కనీసం ఒక సెలబ్రిటీ కూడా అతనికి శుభాకాంక్షలు చెప్పలేదని ఆరోపించారు పృథ్వి. అంతేకాకుండా కె.రాఘవేంద్రరావు చైర్మన్గా వ్యవహరిస్తున్నప్పుడు జరిగిన ఆర్ధిక లావాదేవీలలో ఏవైనా తప్పిదాలు జరిగాయా అని చూడమని కూడా అధికారులకి పృథ్వి చెప్పినట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -