సూపర్ స్టార్ రజినీకాంత్ కు కారోనా పాజిటివ్ అని సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ పోస్ట్ పెట్టడం వల్ల ఈ వార్త సంచలనం అయింది. తమ అభిమాన హీరో రజినీకాంత్ కు కరోనా వచ్చిందా ? అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే ఆ తర్వాత అది నిజం కాదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు రజినీ ఫ్యాన్స్.సదురు పోస్ట్ క్రియేట్ చేసిన యాక్టర్పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.
దీంతో ఈ పోస్ట్ పెట్టడానికి కారణం చెబుతూ తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి అని కోరాడు రోహిత్ రాయ్. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్కి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చిందని, ప్రస్తుతం ఆ కరోనా క్వారంటైన్లో ఉందని పేర్కొన్నాడు. ఈ పోస్ట్కి క్యాప్షన్ పెడుతూ.. ఎక్కువసార్లు చేతులు కడుక్కోవడం, శానిటైజర్స్ ఉపయోగించడం, పారిశుధ్య చర్యలు తీసుకోవడం లాంటివి చేస్తేనే కరోనాని అరికట్టగలం అని తెలిపాడు.
మొత్తంగా చూస్తే ఎంత గొప్పవ్యక్తి అయినా కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని, కరోనాను అందరూ సమానమే అనేలా ఈ పోస్ట్ పెట్టాడు రోహిత్ రాయ్. కానీ రజినీకాంత్కి కరోనా పాజిటివ్ అనే పదం చూసి తట్టుకోలేకపోయిన అభిమానులు రోహిత్ రాయ్ ని ట్రోల్స్ చేస్తున్నారు. చెత్త జోక్ వేశావు, అయినా జోక్ వేయడానికి హద్దు అదుపు ఉండాలి అంటూ ఓ రెంజ్ లో అతన్ని తిడుతున్నారు. ఈ ఫోస్ట్ వైరల్ కావడంతో రోహిత్ చిక్కుల్లో పడినట్లు అయింది.