Saturday, April 27, 2024
- Advertisement -

నిర్మాతల మీదకి నెట్టేసిన శిరీష్

- Advertisement -



అల్లు శిరీష్ ప్రధాన పాత్ర లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు సమర్పణలో మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినెని సంయుక్తం గా నిర్మించిన చిత్రం ABCD. ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తం గా విడుదల అయింది. ఈ సందర్భం లో అల్లు శిరీష్ చాలా సంతోషం గా ఉన్నాడు. మొట్టమొదటి సారి తన సినిమా కి ఒక పాజిటివ్ బజ్ రావడం తో ఎక్కడ లేని సంతోషం అంతా అల్లు శిరీష్ మొహం లోనె కనిపిస్తుంది. అయితే తాజా ట్రేడ్ సమాచారం ప్రకారం అల్లు శిరీష్ ఇంతక ముందు చేసిన ఒక్క క్షణం అన్ చిత్రం కన్న ABCD కె ఎక్కువ బిజినెస్స్ జరిగిందని తెలుస్తోంది. పైగా ఒక్క క్షణం కన్న ABCD కే ఎక్కువ బజ్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచరం. ప్రపంచ వ్యాప్తం గా ఈ సినిమా 607 థియేటర్ల లో రిలీజ్ కావడం విశేషం. ఇదే అల్లు శిరీష్ కెరీర్ లోనె మొట్టమొదటి సారిగా జరుగుతుంది.

అల్లు శిరీష్ సరసన రుక్సార్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించగా భరత్ ఫ్రెండ్ క్యారక్టర్ లో కనిపిస్తాడు. నాగ బాబు అల్లు శిరీష్ కి తండ్రి పాత్ర చేశాడు. అయితే ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శిరీష్ సినిమా విడుదల వెనుక ఉన్న ఆలస్యానికి కారణం అడగగా అందరూ అనుకొనేట్లు కాకుండా షాకింగ్ సమాధానం ఇచ్చాడు.

“నేను సంవత్సరం మొత్తం నా కాల్ షీట్స్ ఇచ్చి రెడీ గా ఉన్నాను కానీ నిర్మాతల వలన సినిమా ఆలస్యం అయింది. దానికి నాకు ఏం సంబంధం లేదు.” అని శిరీష్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -