Saturday, April 27, 2024
- Advertisement -

ప్రముఖ యాంకర్ ని రంగంలోకి దింపబోతున్న ఓంకార్

- Advertisement -

ఓంకార్ దర్శకత్వం వహించిన ‘రాజు గారి గది’ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ‘రాజు గారి గది 2’ చిత్రం అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా ఓంకార్ ‘రాజుగారిగది 3’ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేసారు కానీ ఈ ‘బాహుబలి’ బ్యూటీ సినిమా నుంచి తప్పుకోవడంతో ఓంకార్ కు పెద్ద షాకే తగిలింది. ఇక ఈ సినిమా కోసం మరొక పెద్ద హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టిన ఓంకార్ తాప్సీ, కాజల్ అగర్వాల్ తదితరులను సంప్రదించాలి అనుకుంటున్నారట. అయితే ఈ నేపథ్యంలో మరొక హీరోయిన్ పేరు బయటకు వచ్చింది.

ఓంకార్ ‘రాజుగారిగది 3’ సినిమా కోసం ప్రముఖ యాంకర్ మరియు నటి అయిన రష్మీ గౌతమ్ ని రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్మి గౌతమ్ చాలా హారర్ కామెడీ సినిమాల్లో నటించింది. కాబట్టి ఆమె వెంటనే ఒప్పుకుంటుందని ఓంకార్ అనుకుంటున్నారు. అయితే రష్మి గౌతమ్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాదట మెయిన్ హీరోయిన్ గా ఒక ప్రముఖ నటి ని ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే రష్మీ కి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉండబోతోందని సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -