- Advertisement -
నిర్మాత అశ్వనీదత్ గత కొంతకాలంగా సినిమాలుగా దూరంగా ఉంటున్నాడు.ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో ఆయన గత కొంతకాలంగా సినిమాలను తీయడం మానేశారు.కాని ఆయన కుతుర్లు మాత్రం సినిమాలు నిర్మిస్తు హిట్లు కొడుతున్నారు.ఎవడే సుబ్రమణ్యం,మహనటి సినిమాలను నిర్మించారు అశ్వనీదత్ కుమర్తెలు. ఈ రెండు సినిమాలు హిట్గా నిలిచాయి.మహనటిచ సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఈ సినిమాకు విమర్శల ప్రశంసలు అందుతున్నాయి.
సావిత్రి జీవిత కథను సినిమాగా తెరకెక్కించారు.ఇక అశ్వనీదత్ కూడా మళ్లీ సినిమాలు తీయడం మొదలుపెట్టారు.మహేష్ బాబు 25వ సినిమాను నిర్మిస్తుంది అశ్వనీదతే.ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు అశ్వీనీదత్.ఇకపై తమ బ్యానర్లో వరుస సినిమాలు నిర్మిస్తామని చెప్పారు.