బిగ్బాస్ రెండో సీజన్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించాడు కౌశల్.బిగ్బాస్కు ముందు కౌశల్ ఎవరికి పెద్దగా తెలియదు.సినిమాలతో పాటు , కొన్ని సీరియల్స్లో నటిస్తుండేవాడు కౌశల్.ఇక బిగ్బాస్తో స్టార్ హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకున్నాడు కౌశల్. నీతి ,నిజాయితితో గేమ్ ఆడుతున్న విధానానికి అతని పేరిట సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీని ఏర్పాటు చేశారు.కౌశల్కు మద్దతుగా విజయవాడ,హైదరాబాద్లలో ర్యాలీలు నిర్వహించారు కౌశల్ ఆర్మీ.ఇక బిగ్బాస్లో అతను మొదటి నుంచి ఒంటరిగానే ఉంటున్న సంగతి తెలిసిందే.కౌశల్పై ఎవరు కామెంట్స్ చేసిన వారిపై రెచ్చిపోతున్నారు ఈ ఆర్మీ.ఇంకా చెప్పలంటే వారిని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు కౌశల్ అభిమానులు.
తాజాగా ఈ విషయంపై స్పదించింది కౌశల్ భార్య నీలిమా.బిగ్బాస్లో హౌస్లో జరుగుతున్న సంఘటనలు నాకు బాధ కల్గించాయి అని ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నీలిమా.బిగ్బాస్ హౌస్లో బాధతో పాటు సంతోషకరమైన సంఘటనలు కూడా ఉన్నాయని,సంతోషంతో పాటు బాధను కూడా మీరు పంచకుంటున్నారని కౌశల్ ఆర్మీని ఉద్దేశించి మాట్లాడింది కౌశల్ భార్య నీలిమా.కౌశల్ను మీ ఇంటి సభ్యుడిగా భావించి ,ప్రేమిస్తునందుకు మీకు రుణపడి ఉంటామని తెలిపింది నీలిమా.అలాగే నేను హౌస్లోకి వెళ్లినప్పుడు కౌశల్ ఆర్మీ గురించి ఏం చెప్పలేదని ,కుటుంబ విషయాలు మాత్రమే చెప్పానని అన్నారు.కౌశల్కు మద్దతు తెలిపేవారు ఇతర కంటెస్టెంట్స్ పై ట్రోల్స్ చేయొద్దని, వారికి కూడా కుటుంబాలు ఉంటాయని.. తిట్టడం కరెక్ట్ కాదని నీలిమ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరి కౌశల్ భార్య నీలిమా చెప్పిన మాటలను కౌశల్ ఆర్మీ వింటారో లేదో చూడాలి.