ఇటీవలే వరుసగా వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. సుశాంత్సింగ్ రాజ్పుత్ మరణంతో బాలీవుడ్ మాఫియాపై ఫైర్ అయిన కంగనా.. చాలా మందికి శత్రువు అయింది. మహారాష్ట్ర శివసేన సర్కార్ కూడా ఆమెపై కోపంతో ఆమె బిల్డింగ్ ను కూల్చేసింది. ఆ తర్వాత జయలలిత బయోపిక్ ’తలైవి’ కోసం హైదరబాద్ వెళ్లి షూటింగ్ లో పాల్గొంది.
ఈ నేపథ్యంలో కంగనాను ఉద్దేశిస్తూ ఓ న్యాయవాది ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కంగనాపై కర్ణాటకలోని తుమకూరు జిల్లా క్యతాసంద్ర పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశం మేరకు ముంబయి పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో కంగనా తన సోదరుడి పెళ్లి వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దాంతో ఒడిశాకు చెందిన ఓ లాయర్ కంగనాను నడిరోడ్డుపై రేప్ చేస్తానంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసి షాకైన నెటిజన్లు ఆయనపై ఫైర్ కావడంతో.. తన అకౌంట్ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పుకొచ్చారు. తనకు మహిళల పట్ల గౌరవం ఉందని.. తన అకౌంట్ నుంచి వచ్చిన కామెంట్స్ వల్ల ఫీల్ అయితే క్షమించాలని కోరారు. అనంతరం ఆ లాయర్ తన అకౌంట్ను డిలీట్ చేశారు. ప్రస్తుతం మనాలిలో ఉన్న కంగనా దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు.
నాని తన సినిమా కి ఎందుకు ప్రొడ్యూసర్ ని మార్చాడు..?
జెనీలియా భర్త కదా అని అనేసరి నా ఈగో హర్ట్ అయ్యింది : రితేష్