Saturday, April 27, 2024
- Advertisement -

ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉండబోయే సైరా క్లైమాక్స్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులందరూ మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా చిరు అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని క్లైమాక్స్ ప్రేక్షకులు ఒళ్ళు గగ్గుర్పొడిచే విధంగా ఉంటుందని సమాచారం. సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నిజ జీవితం లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని బ్రిటిష్ వారు కిరాతకంగా చంపేశారు. కనీసం శవాన్ని తిరిగి ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు.

దాదాపు ఒక నెల పాటు ఆ అమర యోధుడి శవం కొండపైనే అలా ఉండి పోయింది. ‘సైరా’ సినిమాలో కూడా క్లైమాక్స్ విషయంలో దర్శకుడు సురేందర్రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం క్లైమాక్స్ ని చాలా బాగా తెరకెక్కించారట. ఇక ఈ సినిమా లో అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి స్టార్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్రబృందం చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

https://www.youtube.com/watch?v=zwJ22kHph-A

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -