గత కొంత కాలం గా హిందీ లో కి ప్రవేశించాలని ఎదురు చూస్తున్న దిల్ రాజు కల ఎట్టకేలకు నెరవేరబోతోంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే మొదటగా ఆయన F2 అనే సినిమా రీమేక్ తో బాలీవుడ్ లో కి అడుగు పెట్టనున్నారు. బోనీ కపూర్ తో ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామి అవ్వనున్నాడు దిల్ రాజు.
ఇదే కాకుండా, ఇంకా జెర్సీ సినిమా ని కూడా హిందీ లో, కరణ్ జోహార్ తో కలిసి నిర్మించే దిశగా దిల్ రాజు ఆలోచిస్తున్నారు. ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ లాగా, ఆయన తెలుగు లో తీసిన ఎవడు సినిమా ని నిఖిల్ అద్వానీ అనే నిర్మాత తో హిందీ లో చేయాలని అనుకుంటున్నాడు.
అయితే ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించి వార్తలు వినిపిస్తున్నా, దిల్ రాజు నిర్మాణం లో పెద్దగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదట. దిల్ రాజు వెళ్ళి నిర్మాణం మొత్తం దగ్గర ఉండి చూసుకోవడం అంటే కష్టమే, కనుక దిల్ రాజు బ్యానర్ పేరు మాత్రం వేసి, షేర్ ఇస్తారట సినిమాలో.
మరి దిల్ రాజు ముంబై కి మకాం మారుస్తున్నారు అని వచ్చిన వార్తల్లో నిజం లేదు అనుకోవాల్సిందే. ఎంతైనా మన ప్రొడక్షన్ స్టైల్ అలవాటు ఉన్న వాళ్ళకి హిందీ లో అంటే కష్టమే.