బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షీ సిన్హాపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.సోనాక్షీ సిన్హా రూ. 37 లక్షల మోసం చేసినట్టు ఓ ఈవెంట్ సంస్థ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొరాదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈవెంట్ మేనేజర్ ప్రమోద్ సిన్హా, సోనాక్షీని సంప్రదించి, ఇండియా ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డ్ కార్యక్రమానికి రావాలని కోరుతూ రూ. 28.17 లక్షలను నాలుగు ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారా ఆమె ఖాతాలోకి పంపారు. సెప్టెంబర్ 30న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రమోద్, మరో రూ. 9 లక్షలను ఈవెంట్ కోసం ఖర్చు చేశారు. సోనాక్షి ప్రయాణానికి అవసరమైన టికెట్లను, బస ఏర్పాట్లనూ కూడా చేశారు.
ఈవెంట్కు అన్ని ఏర్పాట్లు చేసిన తరుణంలో సడన్గా ఈవెంట్ సంస్థకు షాక్ ఇస్తు ,షో రాకుండా ఎగొట్టింది సోనాక్షీ.దీని వల్ల సంస్థకున్న పేరు దెబ్బతిందని ఈవెంట్ మేనేజర్ ప్రమోద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్ద డబ్బు తీసుకున్న తరువాత, అవార్డు ప్రమోషనల్ వీడియోల్లోనూ ఆమె నటించారని, ఉదయం 10 గంటలకు విమానం ఎక్కాల్సిన ఆమె ఎయిర్ పోర్టుకు రాలేదని, ఆపై 3 గంటల విమానానికి టికెట్లు బుక్ చేయగా, ఆమె ఎగ్గొట్టిందని ఆయన ఆరోపించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును బట్టి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. అసలే సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నా సోనాక్షీపై ఇటువంటి ఆరోపణలు రావడంపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.