- Advertisement -
యంగ్ హీరో నిఖిల్ ఈ మధ్య సినిమాలతో పాటు ప్రాధమిక సమస్యలపై కూడా స్పందిస్తున్నారు.తాజాగా ఈ యంగ్ హీరో ప్రధాన మంత్రి మోదీపై కూడా కామెంట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. పేదలకు 10శాతం కోటా రిజర్వేషన్ను కల్పించడంపై నిఖిల్ కామెంట్ చేశాడు. మంగళవారం పేదలకు 10శాతం రిజర్వేషన్ బిల్లును లోక్ సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
దీని గురించి ముందే నేను ,రానా చర్చించుకున్నామని,మేము అనుకున్నదే మోదీ అమలు చేశారని ట్విట్ చేశాడు నిఖిల్.పేదలకు పదిశాతం రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణకు దాదాపు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి. నిఖిల్ చేసిన ట్విట్కు కొందరు పాజిటివ్గా స్పందిస్తుండగా , మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు.నీకు రాజకీయలు గురించి అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.