Saturday, April 27, 2024
- Advertisement -

నన్ను వేదించి చంపుతారు : జబర్దస్త్ నటి సాయితేజ

- Advertisement -

జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ గా మారారు. ఎంతో మంది జీవితాలు మారాయి. అలాంటి వారిలో కమెడియన్ సాయితేజ. జబర్దస్త్ స్టేజ్ పై ఎన్నో స్కీట్లో ఇతడు నటించాడు. అయితే నిజజీవితంలో తాను ఎన్నో బాధలు ఎదుర్కున్నట్లు సాయితేజ చెప్పుకొస్తున్నాడు. అబ్బాయి నుంచి ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారిన సాయితేజ.. ప్రియాంకగా పేరు మార్చుకున్నాడు.

ఈ మధ్యే ఆమెకి పెళ్లైందని పుకార్లు వినిపించాయి. కానీ తాను ఎవర్ని పెళ్లి చేసుకోలేదని.. అవన్నీ పుకార్లే అని తెలిపాడు. సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన తర్వాత చాలా మంది దారుణంగా వేధించారని.. ఇష్టానుసారం విమర్శించారని చెప్పాడు సాయితేజ. ఇక జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసే వినోద్ పై దాడి గురించి చెబుతూ. ఇంటిని కొలుగులు విషయంలో వినోద్ పై ఓనర్ దాడి చేయించాడని చెప్పాడు.

ఇక తన విషయంలో ఇప్పటికి కొందరు వేధింపులకు గురి చేస్తున్నట్లు సాయి తేజ తెలిపాడు. ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని.. కానీ బయటి నుంచి చూసి కొందరు పనీపాట లేని వెధవలు మాత్రం తమపై కామెంట్స్ చేస్తుంటారని చెబుతుంది ప్రియాంక. ఇక ఇప్పుడు కూడా తనను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని.. అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతున్నాడు సాయితేజ.

షూటింగ్ కోసం రమ్మని.. తనతో మూడు రోజులు గడపాలని చెప్పాడు. దాంతో ఆ సినిమాని వదిలేశాను అని చెప్పాడు. ఇక సినిమాల్లో ఇలాంటివి తప్పవని.. కాకుంటే ఎవరి దగ్గర కంప్రమైజ్ కానని.. అవకాశం వస్తే చేస్తా లేకుంటే లేదని చెప్పాడు సాయితేజ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -