Saturday, April 27, 2024
- Advertisement -

రోజాని జబర్దస్త్ మానేయ‌మ‌న్న జ‌గ‌న్‌

- Advertisement -

తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న పాపులర్ కామెడీ షో జబర్దస్త్. తెలుగు టీవి ఛానెల్స్‌లో ఈ షోకి వ‌చ్చిన రేటింగ్ మ‌రో షోకి రాదు అంటే ఈ షో ఎంత పాపుల‌ర్ అయిందో అర్ధం చేసుకొవాలి. జబర్దస్త్ చాలా తక్కువ సమయంలోనే అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈ కార్యక్రమంలో జడ్జిలుగా నాగబాబు,రోజాలు కూడా అదే స్థాయిలో ఆకట్టుకున్నారు. నాగబాబు,రోజాలు లేని జబర్దస్త్ ఊహించుకోవటం కష్టం.కాని రాబోయే కాలంలో రోజా జబర్దస్త్‌ని మానేస్తున్నార‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

అయితే ఇది నిజ‌మే అని తెలుస్తుంది.రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌రుపున చిత్తురు జిల్లా న‌గ‌రి నియోజిక వ‌ర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.ఎమ్మెల్యే కాక‌ముందు నుండి ఆమె జబర్దస్త్‌కు జడ్జిగా వ్య‌వ‌హ‌రిస్తుంది.అయితే ఎలెక్ష‌న్స్‌కు టైం ద‌గ్గ‌ర ప‌డ‌టం,గ‌త ఎన్నిక‌ల‌లో ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఓడిపోయిన వైఎస్‌.జ‌గ‌న్,వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఎట్టిప‌రిస్థితుల‌లో గెలిచి అధికారంలోకి రావ‌ల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.దానిలో భాగంగానే నియోజిక వ‌ర్గాల మీద దృష్టి పెట్ట‌ల‌ని ఎమ్మెల్యేల‌కు పిలుపునిచ్చారు.

అందులో భాగంగా రోజాని జబర్దస్త్ మానేయ‌ల‌ని జ‌గ‌న్ కోరార‌ని స‌మాచారం. రోజా పై విమ‌ర్శ‌లు చేసే ప్ర‌త్య‌ర్థి పార్టీ వాళ్లు జబర్దస్త్ కార్న‌ర్ చేసుకుని విమ‌ర్శ‌లు చేయ‌డం పరిపాటిగా మారింది.అయిన జబర్దస్త్ చేస్తు వ‌చ్చింది రోజా.ఇప్పుడు త‌మ అధినేత మాట మేర‌కు జబర్దస్త్ మానేయ‌డానికి సిద్ధం అవుతున్నారు.ఎలెక్ష‌న్స్ అయిన త‌రువాత మ‌ళ్లీ జబర్దస్త్ చేసుకొవ‌చ్చు అని జ‌గ‌న్ తెలిపార‌ని రోజా త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెబుతున్నార‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -