Friday, April 26, 2024
- Advertisement -

కోర్టు మెట్లెక్కిన‌ ప్ర‌భాస్‌

- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ హైకోర్టును ఆశ్ర‌యించారు.త‌న గెస్ట్ హౌస్ విష‌య‌మై ప్ర‌భాస్ హైకోర్టును ఆశ్ర‌యించిన‌ట్లు తెలుస్తుంది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..శేరిలింగంపల్లిలోని ప్ర‌భాస్ గెస్ట్ హౌస్‌ను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.ఆక్రమిత స్థలంలో ఉందంటూ ప్ర‌భాస్‌ గెస్ట్ హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.ఈ స్థ‌ల వివాదంపై ప్రభాస్ నేడు హైకోర్టును ఆశ్రయించారు. నందిని హిల్స్ లోని తన ఇంటికి తాళం వేసిన అధికారులు, నోటీస్ అంటించారని చెబుతూ, తాను ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసివున్నానని, దానిపై నిర్ణయం వెలువడకుండానే ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు.

రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ తరఫున ఆయన న్యాయవాది పిటిషన్ ను దాఖలు చేశారు.దీనిపై విచార‌ణ చేప‌ట్టేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది.సర్వే నంబర్ 46లో ఉన్న 84 ఎకరాల ప్ర‌భుత్వ భూమిలో ప్ర‌భాస్ గెస్ట్ హౌస్ ఉండ‌టంలో ఈ వివాదం మొద‌లైంది.అయితే ప్ర‌భాస్ ఈ గెస్ట్ హౌస్ వేరే వారి ద‌గ్గ‌రి నుంచి కొనుగొలు చేసిన‌ట్లు స‌మాచారం.దీని విలువ వంద కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -