Saturday, April 27, 2024
- Advertisement -

దాడిపై పోలీసులకు రాహుల్ ఫిర్యాదు..!

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో బీరు బాటిళ్లతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు రాహుల్ వెళ్లి.. తనపై జరిగిన దాగి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక దాడి ఎలా జరిగింది అనేదానిపై రాహుల్ క్లారిటీ ఇచ్చాడు.

కొందరు రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్లే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తన స్నేహితురాల్ని మాటలతో వేధిస్తున్న ముగ్గుర్ని తాను నిలదీశానని, అయితే మాటలు పెరగడంతో రితేశ్ రెడ్డి అనే యువకుడు తనను కొట్టాడని రాహుల్ వెల్లడించారు. రాహుల్ సిప్లిగంజ్ లాంటి సెలబ్రిటీని కొట్టాం అని చెప్పుకోవడానికే రితేశ్ రెడ్డి తదితరులు ఈ దాడి చేసినట్టు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

ఘటన సమయంలో ఇద్దరు బౌన్సర్లు ఉన్నా వారు నిస్సహాయుల్లా మిగిలిపోయారని తెలిపారు. ఈ విషయంలో తాను న్యాయం కోసం పోరాడుతున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారం పట్ల ఎంతో ఆగ్రహం కలుగుతోందని, కానీ కొన్ని విషయాలు మీడియా ముందు మాట్లాడలేకపోతున్నానని అన్నారు. రితేశ్ రెడ్డి వాళ్ల అన్న టీఆర్ఎస్ పార్టీ నేత అని తెలిసిందని, అయితే తనకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పబ్ లో జరిగిన దాడి సమయంలో తాను ఆవేశానికి లోనవడం నిజమేనని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -