Saturday, April 27, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌ను చంపింది ల‌క్ష్మీ పార్వ‌తేన‌ట‌

- Advertisement -

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచారు.రామ్ గోపాల్ వ‌ర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.తాజాగా ఈ సినిమా సంబంధించి ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వ‌ర్మ‌.ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతు లక్ష్మీపార్వతిపై కొందరిలో నెగెటివ్ ఇంప్రెషన్ ఉంది.

ఆమె కారణంగానే చివరి రోజుల్లో ఎన్టీఆర్ బాగా ఇబ్బంది పడ్డారనే భావన ఉంది.నేను దీనిని వేరే విధాంగా.. అంటే ఉన్న‌ది ఉన్న‌ట్లు చూపిస్తాను అని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతి రిలేషన్ కారణంగానే ఆయన పదవి పోవడం, చనిపోవడం జరిగింది. వారిద్దరి కలయిక వలన రాజకీయాల్లో ఊహించని పరిణామాలు ఏర్పడ్డాయి. ఆ రాజకీయ పరిణామలన్నింటినీ కలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నాను” అని చెప్పారు.నేను ల‌క్ష్మీ పార్వతి గొప్ప‌ద‌నం గురించి ఈ సినిమాలో చూపిస్తాన‌ని తెలిపారు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -