Friday, April 26, 2024
- Advertisement -

నేను చ‌నిపోతే వాళ్ల‌కు మాత్రం చెప్పొద్దన్నాను: రమాప్రభ

- Advertisement -

తెలుగులో సీనియ‌ర్ న‌టి అంటే అంద‌రికి గుర్తు వ‌చ్చే పేరు రమాప్రభ.ఆ త‌రం నటుల నుండి ఈ త‌రం నటుల వ‌ర‌కు అంద‌రితో క‌లిసి న‌టించింది రమాప్రభ.గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్నరమాప్రభ .. .క‌మెడియ‌న్ ఆలీ యాంక‌ర్‌గా వ్య‌వ‌హారిస్తున్న ఆలీతో జాలీగా అనే టీవీ ప్రొగ్రామ్‌లో క‌నిపించి సంద‌డి చేసింది.త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను ఈ షోలో ప్రస్తావించారు ర‌మాప్ర‌భ‌.అల‌నాటి క‌మెడియ‌న్ యాక్ట‌ర్స్ రేలంగి, రమణా రెడ్డి ,అల్లు రామలింగయ్య,పద్మనాభం,రాజబాబు,చ‌లంతో క‌లిసి తెలుగు తెరపై రమాప్రభ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

నన్ను ఇండ‌స్ట్రీలోని కొంద‌రు కావాల‌ని తొక్కేశార‌ని,చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాక .  నా స్థాయిని తగ్గించాలని చాలా మంది ప్ర‌య‌త్నించార‌ని తెలిపింది.ద‌ర్శ‌కుడి పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌తి నెల 10000 త‌న‌కు పోస్ట్ ద్వారా పంపిస్తాడ‌ని చెప్పుకొచ్చింది ర‌మాప్ర‌భ‌.నేను చ‌నిపోతే ‘మా’ అసోసియేషన్ కి గానీ , సినిమావాళ్లకి గాని చెప్పొద్దని మా వాళ్లకి చెప్పాను. ఎందుకంటే సినిమా వాళ్లే నా ఈ ప‌రిస్థికి కార‌ణం వాళ్లే అని,నా కోసం అక్క‌డ ఏడ్చేవాళ్ల ఎవ‌రు లేర‌ని తెలిపింది.ఇక అల‌నాటి తార‌ల‌తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని ఈ షో ద్వారా మ‌ళ్లీ గుర్తు చేసుకున్నారు ర‌మాప్ర‌భ‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -