తెలుగు చిత్రపరిశ్రమకు మా అసోసియేషన్లో మరోసారి వివాదాలు బయటపడ్డాయి.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా శివాజీరాజా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శివాజీరాజా ఆర్టిస్టుల సంఘం డబ్బుని తన వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.మా ఫండ్ అసోసియేషన్ కి సంబంధించిన కొన్ని రికార్డులు మిస్ అయ్యాయని, 2017 ఫైల్స్ కనిపించడం లేదని, కొన్ని వీడియోలు కూడా మిస్ అయ్యాయని వార్తలు బయటకి వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మా అసోసియేషన్ నుంచి శివాజీ రాజాను తొలగించి ఆ బాధ్యతలను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీనియర్ నరేష్కు అప్పగించారని వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ వార్తలపై మా అధ్యక్షుడు శివాజీ రాజాతో మా అసోసియేషన్ సభ్యులు స్పందించారు.20 ఏళ్లుగా ఈ అసోసియేషన్ లో ఉన్నాను. నా మీద నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 5 పైసలు కూడా నేను ఎప్పుడూ మిస్ యూజ్ చేయలేదు. అలా జరిగిందని నిరూపిస్తే.. గుండు కొట్టించుకొని ఇక్కడి నుండి వెళ్లిపోతా” అంటూ నటుడు శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మా సభ్యులు మాట్లాడుతు…మా అసోసియేషన్ లో ఎలాంటి విబేధాలు లేవు.’మా’ లో గతేడాది వరకు 2 కోట్ల 10 లక్షలు విరాళాలు ఉంటే ఈ ఏడాదికి ఆ నెంబర్ 5.50 కోట్లకు చేరుకుంది. 10 కోట్లు అవ్వగానే అసోసియేషన్ కోసం ఓ భవంతి కట్టాలనేది మా ప్లాన్” అంటూ పరుచూరి వెంకట్రావు అన్నారు.