Saturday, April 27, 2024
- Advertisement -

మహేష్ బాబుపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి..!

- Advertisement -

వివాదాస్పద కామెంట్స్ తో.. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది నటి శ్రీరెడ్డి. టాలీవుడ్‌లో ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టే ఈమె ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబుపై కామెంట్ చేసింది. విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే రికార్డులను తిరగరాసింది.

అయితే ఎప్పుడూ ఏదో ఒక ఫేమస్ సెలబ్రిటిని టార్గెట్ చేయడం శ్రీరెడ్డి స్టైల్. తాజాగా మహేష్ గురించి కామెంట్ చేస్తూ.. సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు గారూ.. మీరు తెలుగు చిత్రసీమలో రారాజు అంటూ తన సందేశం పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. అంతేకాదు మీరు చంద్రుడు అని తెలుపుతూ ఇతర తారలంతా స్టార్స్ మాత్రమే అని పేర్కొంది శ్రీ రెడ్డి. ఈ సారి పాజిటివ్ కామెంట్స్ చేసింది.

ఈ పోస్టు చూసిన సూపర్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. థాంక్యూ మేడం అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం.. నటి శ్రీరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. మా హీరోని బండ బూతులు తిడుతావు.. మహేష్ ని మాత్రం పొగుడుతావా ? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీరెడ్డి ప్రస్తుతం వెండితెరపై తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతోంది. క్లైమాక్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -