Saturday, April 27, 2024
- Advertisement -

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ కి పూర్వ వైభవం?

- Advertisement -

వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ చిత్రాలని మనకి అందించిన బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఎంఎస్ రాజు నిర్మాత గా వచ్చిన ఈ సినిమా లు ఆయన కి నిర్మాత గా గౌరవాన్ని అందించాయి. అయితే కొద్ది రోజులుగా ఆయన సినిమా నిర్మాణానికి దూరం గా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. కొడుకు సుమంత్ అశ్విన్ కెరీర్ ని గాడి లో పెట్టె పని లో చాలా ఏళ్ళు గడిపిన ఎంఎస్ రాజు ప్రస్తుతం మరలా సినిమా నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

ఆసక్తికర విషయం ఏంటి అంటే, త్వరలో ఈ నిర్మాత విశ్వక్సేన్ హీరో గా ఒక కొత్త చిత్రాన్ని మొదలు పెట్టె పని లో ఉన్నాడట. పని లో పని గా విశ్వక్ కి అడ్వాంస్ కూడా ఇచ్చేసి తన కొడుక్కి మంచి కథ కూడా ఉంటె చెప్పమని అన్నట్టు ఇండస్ట్రీ టాక్. హీరో గా పేరు తెచ్చుకున్న విశ్వక్సేన్ త్వరలో దర్శకుడి గా కూడా తన ప్రతిభ ని నిరూపించుకోనున్నట్లు మన అందరికీ తెలిసిందే.

ఫలక్నూమా దాస్ తో విశ్వక్ దర్శకుడి గా అరంగేట్రం చేయనున్నాడు. త్వరలో వీరి ప్రాజెక్ట్ కి సంబందించిన వివరాలు తెలియనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -