సునయన చైల్డ్ ఆర్టిస్టుగా చిన్నప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకుంది. అమ్మోరు వంటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటిచింది. పెద్దైన తర్వాత సినిమాలకు దూరమైంది. పెళ్లి తర్వాత యూబ్యూట్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది. మళ్లీ సినిమాల్లో కూడా నటిస్తోంది. తాజాగా ఆమె ప్రముఖ షోకు గెస్టుగా వచ్చింది.
ఈ సందర్భంగా అమ్మాయిలు.. అబ్బాయిలు.. ఆంటీలు అంటూ హాట్ కామెంట్స్ చేసింది. విషయంలోకి వెళ్తే.. బాల నటిగా, నటిగా, ఆర్జేగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్లో ఎన్నో పాత్రలు పోషించిన సునయన.. పెళ్లి తర్వాత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ‘ప్రస్టేటెడ్ ఉమెన్’ అనే పేరుతో ఓ సిరీస్ను నిర్వహించారు. భారీ స్థాయిలో దీనికి స్పందన వచ్చింది. తెలుగులోనే సక్సెస్ఫుల్ షోగా పేరొందిన బిగ్ బాస్… ఇటీవలే నాలుగో సీజన్ను మొదలెట్టింది.
ఇందులో కంటెస్టెంట్గా ఉండాలని షో నిర్వహకులు సునయనను సంప్రదించారని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, ఆమె అందుకు గానూ రోజుకు రూ. లక్ష డిమాండ్ చేసిందని కూడా వార్తలు వచ్చాయి. దీంతో సునయన మరోసారి వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ అయ్యారు. ప్రముఖ చానెల్లో ప్రసారం అవుతోన్న ‘వావ్ 3’లో కౌముది, మంగ్లీ, నిఖిల్తో కలిసి పాల్గొన్నారు సునయన. సాయి కుమార్ సారథ్యంలో వస్తున్న ఈ షోలో ఆమె మాట్లాడుతూ ‘అబ్బాయిలు ఆంటీలతోనే చెక్అవుట్ చేస్తారు. వాళ్లకు అమ్మాయిలు అంత ఈజీగా పడరు’ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో చూడండి.
పవన్ కళ్యాణ్ అభిమానులపై ఫైర్ అయిన అనసూయ..!
ఆరు నెలల ప్రెగ్నెంట్ కాబట్టే పవన్ సినిమా వదిలేశా : అనసూయ