Friday, April 26, 2024
- Advertisement -

సందీప్ కిషన్ స్థానంలో వెన్నెల కిషోర్

- Advertisement -

యువ హీరో సందీప్ కిషన్ త్వరలో ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో అన్య సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇంతకుముందు టీజర్లోనే ఈ చిత్రం కాన్సెప్ట్ ని రివీల్ చేశారు. అద్దంలో సందీప్ కిషన్ మొహం చూసుకుంటే తన మొహం కాకుండా వెన్నెల కిషోర్ మొహం కనిపిస్తుంటుంది. అయితే ఈ ట్రైలర్ లో ఇలా ఎందుకు జరుగుతుంది అని డాక్టర్లను సంప్రదించే ప్రయత్నం చేస్తాడు సందీప్ కిషన్.

ఈ నేపథ్యంలో సినిమాలో కామెడీ జనరేట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఒకవైపు కామెడీ మాత్రమే కాకుండా మరో వైపు జోనర్ కి తగ్గట్టుగానే హారర్ సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో సందీప్ మరియు అన్య సింగ్ ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్ గా ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్ మరియు విస్తా డ్రీం మర్చంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ స్వరాలు చేకూరుస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -