అల వైకుంఠపురములో, వకీల్ సాబ్ సినిమాలు ఘన విజయం సాధించడంతో పాటు ఆ సినిమాల్లోని పాటలు సక్సెస్ కావడంతో తమన్ ఓ రేంజ్ కు చేరుకున్నారు. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, తమ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అగ్రహీరోల సినిమాలకు ఎక్కువగా వీరిద్దరే సంగీతం అందిస్తూ వచ్చారు. పదేళ్లుగా వీరిద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ పైచేయి మాత్రం దేవిశ్రీప్రసాద్ ఇస్తూ వచ్చాడు. అయితే గత ఏడాది నుంచి సీన్ రివర్స్ అయింది.
అల వైకుంఠపురములో మ్యూజికల్ గా సంచలనం సృష్టించడంతో తమన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. టిక్ టాక్ సోషల్ మీడియాలో సైతం ఈ పాటలను ఎంతో మంది అనుసరించారు. ఆ తర్వాత తమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన వకీల్ సాబ్ లోని పాటలు కూడా మంచి పేరు తెచ్చుకోవడంతో తమన్ అగ్రస్థానం లోకి దూసుకెళ్లాడు. టాలీవుడ్ లో అగ్ర హీరోలు నటిస్తున్న మెజార్టీ సినిమాలకు ప్రస్తుతం తమన్ సంగీతం అందిస్తున్నాడు.
వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న పవన్ కళ్యాణ్ మలయాళం రీమేక్ మూవీ అయ్యప్పనుమ్ కోషియం కి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే పొంగల్ రేసులో ఉన్న మరో సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. ఇలా ఇద్దరు బడా హీరోలు పోటీ పడుతున్న రెండు సినిమాలకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో తమన్ కు తమనే పోటీ అని అంతా అంటున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా మ్యూజికల్ గా పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read
‘దృశ్యం’ రిజెక్ట్ చేసిన రజనీకాంత్? కారణం ఏమిటంటే?