Friday, April 26, 2024
- Advertisement -

బాలీవుడ్ పెత్తనం, సాహో పై ప్రభావం

- Advertisement -

ప్రభాస్ హీరో గా నటిస్తున్న చిత్రం సాహో. బాహుబలి సినిమా విడుదల అయిన చాలా ఏళ్ళకి ఈ సినిమా ఈ నెల చివరన ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా ఈ సినిమా ఇప్పటికే ఎంతో మంచి బజ్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఒక తెలుగు సినిమా గా మొదలైనప్పటికీ బాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా కలవడం తో వాళ్ళ పెత్తనమే ఎక్కువ అయిపొయింది. సినిమా కి సంబందించిన అన్ని కీలక నిర్ణయాలు బాలీవుడ్ టీమ్ తీసుకుంటుంది. అందుకనే పాటల విషయం లో తెలుగు అభిమానులు చాలా నిరుత్సాహపడుతున్నారు.

అయితే తాజా ఫిలిం నగర్ వార్తల ప్రకారం సాహో సినిమా కి ప్రీమియర్స్ ఉండేట్లు గా కనిపించడం లేదట. అమెరికా లో తెలుగు సినిమా కి ప్రీమియర్స్ చాల పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రభాస్ కి అక్కడ మంచి మార్కెట్ కూడా ఉండటం తో ప్రీమియర్స్ లో చాలా వరకు డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది.

కానీ సినిమా ని విడుదల చేస్తున్న యష్ రాజ్ ఫిలిమ్స్ వారు హిందీ సినిమాల వలె ప్రీమియర్స్ లేకుండా సాహో ని విడుదల చేయాలి అని అనుకుంటున్నారు అని టాక్ నడుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -