- Advertisement -
బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న అనూష కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అనూష స్వస్థలం సిద్దిపేట జిల్లా మందపల్లిగా గుర్తించారు. ఆమె పుస్తకంలో ఉన్న సూసైడ్ లేఖను ట్రిపుల్ ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటూ ఆమె వద్ద లభించిన సూసైడ్నోట్ ద్వారా తెలుస్తోంది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. సిద్దిపేటకు చెందిన నాగరాజును ఏమనకూడదని, తాను బతికి ఉంటే నాగరాజుతోనే కలిసి ఉంటానని అనూష తన లేఖలో రాసింది. అనూష ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.