Friday, April 26, 2024
- Advertisement -

అల వైకుంఠపురములో కథ లీక్.. ట్విస్ట్ ఇదే..!

- Advertisement -

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. వీరిద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. మళ్లీ వీరి కాంబోలో సినిమా రాబోతుండటంతో భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అల్లు అర్జున్ చివరి చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆశించిన స్థాయులో సక్సెస్ కాలేదు.

దాంతో కాస్త ఎక్కువగానే టైం తీసుకుని త్రివిక్రమ్ తో బన్నీ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇక స్టోరీ విషయంకు వస్తే.. రెండు ఫ్యామిలీల మధ్య స్టోరీ సాగనుంది. ఓ ఉన్నత కుటుంబం.. వారి దగ్గర డ్రైవర్ గా పని చేసే వ్యక్తి కుటుంబం సన్నిహింతంగా ఉంటారు. ఇరు ఫ్యామిలీలో ఒకేసారి మగపిల్లలు పుడతారు. అయితే కొన్ని కారణాల చేత.. డ్రైవర్ కొడుకు పెద్దింట్లో.. పెద్దింటి కొడుకు డ్రైవర్ ఇంట్లో పెరుగుతారు.

వాళ్లు పెద్దైన తర్వాత అసలు నిజం తెలుస్తోంది. అసలు వీరు తమ ఫ్యామిలీలతో ఎందుకు ఉండలేదు అనేది కథ. ఈ స్టోరీలో పెద్దింట్లో పుట్టి డ్రైవర్ ఇంట్లో పెరిగే కుర్రాడిగా అల్లు అర్జున్.. డ్రైవర్ ఇంట్లో పుట్టి పెద్దింట్లో పెరిగే కుర్రాడిగా సుశాంత్ నటిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. అసలు కథ ఏంటొ తెలియాలంటే సినిమా వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హిగ్డే నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -