Friday, April 26, 2024
- Advertisement -

మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న జియో..!!

- Advertisement -

మొబైల్ రంగంలో సంచలనాత్మక విప్లవాన్ని తెచ్చిన జియో ఇప్పుడు మరో కొత్త విప్లవానికి తెరతీసింది.. ఇప్పటికే దేశంలో 4G వినియోగం లో ఉండగా 5G ని అందుబాటులోకి తేవాలని జియో ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.. ఈ సంవత్సరం చివరికి భారత మార్కెట్లోకి 10 కోట్ల చౌక స్మార్ట్ ఫోన్లను అందించేందుకు ప్రణాళికలు రూపొందించిందని తెలుస్తోంది. ఇవన్నీ గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ పై తయారవుతాయని, ఔట్ సోర్సింగ్ విధానంలో వీటి తయారీ ఇప్పటికే ప్రారంభమైపోయిందని ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఫోన్లు 4జీ, 5జీ రేడియో తరంగాలకు మద్దతిస్తాయని పేర్కొంది.

ఇటీవల రిలయన్స్ అనుబంధ సంస్థల్లోకి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సహా ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టగా, రిలయన్స్ ఇండియాలోనే అత్యధిక విలువైన సంస్థగా అవతరించిన సంగతి తెలిసిందే. జూలైలో జరిగిన వాటాదారుల సమావేశంలో ప్రసంగించిన ముఖేశ్ అంబానీ సైతం ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ పై 4జీ, 5జీ ఫోన్లను అందరికీ అందుబాటులోకి తెస్తామని, ఫోన్ ను స్వయంగా రిలయన్స్ డిజైన్ టీమ్ తయారు చేస్తుందని వెల్లడించారు కూడా.

రిలయన్స్ అనుబంధ డిజిటల్ విభాగం జియో ప్లాట్ ఫామ్స్ లో దాదాపు 33 శాతం వాటాలను అధినేత ముఖేశ్ విక్రయించగా, 1.52 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంతో రిలయన్స్ రుణరహిత సంస్థగా నిలిచింది. జియో ప్లాట్ ఫామ్స్ లో ఆల్ఫాబెట్ తో పాటు ఫేస్ బుక్, ఇంటెల్, క్వాల్ కామ్ వంటి టెక్ దిగ్గజాలు పెట్టుబడులను పెట్టాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -