Friday, April 26, 2024
- Advertisement -

రాహుల్ ఎటాక్ పై స్పందించిన పునర్నవి ?

- Advertisement -

ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై ఇటీవలే ఓ పబ్ లో బీర్ బాటిల్స్‌తో ఎటాక్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఎటాక్ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసారు రాహుల్. వికారాబాద్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రిషిత్ శెట్టి ఈ ఘటనకు పాల్పడ్డాడని, అతనిపై గతంలోనూ ఇలాంటి కేసులు ఉన్నాయని రాహుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పబ్ లో ఏం జరిగిందో కూడా వివరిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసి న్యాయం కోరారు. “పబ్ లో పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది కదా అని నేను ఒక్కడినే ఉన్నానని నన్ను టార్గెట్ చేసారు. నేను ఏమీ అడగటంలేదు. నాకు న్యాయం కావాలి. తప్పు నాదైతే పడ్తా. తప్పు నాది కానప్పుడు నన్ను గెలికితే నేను ఎందుకు ఊరుకుంటా. వాళ్లు ఎనిమిది మంది ఉన్నారు. వాళ్లకు సిగ్గు అనిపించాలి. బ్యాగ్రౌండ్ ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. ఎక్కడపడితే అక్కడ చూపిస్తే బాగోదు. వాడు ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే. అమ్మతోడు నేను ఎవ్వరినీ వదలను. నాకు న్యాయం కావాల్సిందే. ఈ ఘటన ఎక్కడికి పోతుందో చూద్దాం” అంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు.

అయితే ఇదే విషయంపై పునర్నవి రాహుల్ కు ఫోన్ చేసి ఎలా ఉన్నాడో అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. పునర్నవి రాహుల్ మంచి ఫ్రెండ్స్. బిగ్ బాస్ లో రాహుల్ సరిగ్గా నడుచుకుని గెలవడానికి పునర్నవి చాలా ఉపయోగపడింది. దాంతో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు లవ్ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి కానీ తాము ఫ్రెండ్స్ మాత్రమే అని ఇద్దరు కన్ఫార్మ్ చేశారు. అందుకే రాహుల్ పై దాడి జరిగిందని తెలియగానే వెంటనే ఫోన్ చేసి రాహుల్ ఎలా ఉన్నడో తెలుసుకుని.. జాగ్రత్తగా ఉండమని చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైన క్లోజ్ ఫ్రెండ్ కి ఏదైన అవుతే ఆ మాత్రం పలకరింపులు ఉంటాయని అందరికి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -