Saturday, April 27, 2024
- Advertisement -

శ్రీముఖి, బాబా మాస్టర్ పని అయిపోయింది.. ఎందుకంటే ?

- Advertisement -

తెలుగులో బిగ్ బాస్ షో కు ఉన్న క్రేజ్ మరే షోకి లేదని చెప్పవచ్చు. ఇప్పటికే రెండు సీజన్ లు చూసిన ప్రేక్షకులు ఇప్పుడు మూడో సీజన్ ముగింపు చేరుకునే వరకు కూడా అదే విధంగా ఆదరిస్తూ వచ్చారు. అయితే మొత్తం 17మంది కంటెస్టెంట్స్ గా వెళ్లిన వారు ఆకరుకు తమదైన శైలీలో ఆడుతూ ఎవరికి వారు అభిమనులను సొంతం చేసుకున్నారు. అలా ఫ్యాన్స్ ను సంపాధించుకుని ఫైనల్స్ కు వచ్చే వరకు ఒక గ్రాఫ్ ను ఏర్పరచుకున్నారు.

ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి, రాహుల్, వరుణ్, అలీ, బాబా మాస్టర్ లు ఉన్నారు. ఇందులో బాబా మాస్టర్ తనకంటూ ఒక బెంచ్ మార్క్ ను ఏర్పర్చుకున్నారు. ఫైనల్స్ కు ముందు వరకు కూడా బాబా పట్ల ప్రేక్షకులకు మంచి ఒపీనియన్ ఉండేది. ఆయనకు సపోర్ట్ గా చాలా మంది ఓట్లు కూడా వేశారు. కొన్ని సందర్భాల్లో అయితే టాప్ 3 కంటెస్టెంట్ గా నిలించేందుకు బాబాకు అనుకూల వాతవరణాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం బాబా ఊసే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం లేదు.

బాబా తప్పిస్తే మిగితా ఇంటి సభ్యుల అభిమానులు తమ కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వారికి హైప్ తీసుకొస్తున్నారు. కానీ బాబా ఫ్యాన్స్ మాత్రం కనిపించడం లేదు. దాంతో బాబా గ్రాఫ్ భారీగా పడిపోయిందని చెప్పాలి. టైటిల్ విన్నార్ స్థాయిలో వరుణ్ ఉన్నట్లు కనిపిస్తుంది. రాహుల్ కూడా వరుణ్ తో పోటీ పడే ఛాన్స్ ఉంది. శ్రీముఖి టాప్ 3 లో నిలిచే ఛాన్స్ ఉంది. శ్రీముఖిపై నెగిటివ్ టాక్ ఉండటం వల్ల ఆమెకు ఓట్లు తక్కువ పడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -