Friday, April 26, 2024
- Advertisement -

‘సాక్ష్యం’కి బ్రేకులు వేసిన సెన్సార్?

- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్ ,పూజ హెగ్డె హీరో,హీరోయిన్లుగా న‌టించిన‌ సినిమా సాక్ష్యం.ఈ సినిమాకు శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా వచ్చేవారం విడుద‌ల కానుంది. అయితే ప్రమోష‌న్స్‌లో బాగా వెన‌క‌ప‌డి ఉంది చిత్ర యూనిట్‌. ఫాంటసీ నేపధ్యంలో రూపొందిన ఇలాంటి సినిమాలను జనం మనసులోకి రిజిస్టర్ అయ్యేలా తీసుకెళ్లడం చాలా అవసరం. కానీ సాక్ష్యం టీమ్ ఎందుకు సైలెంట్ గా ఉందా అనే అనుమానం ఫిలిం నగర్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది.

సెన్సార్ కు వెళ్లిన సాక్ష్యంలో కొన్ని జంతువులతో తీసిన సన్నివేశాలు ఉండటంతో వాటికి సంబందించిన అనుమతి పత్రాలు చూపమని అధికారులు అడగటంతో అప్పటికప్పుడు వాటిని ఇవ్వలేక కొంత సమయం అడిగినట్టు సమాచారం.దీంతో సినిమా రిలీజ్ డేట్‌పై అనుమానాలు నెల‌కొన్నాయి.దీంతో సినిమా ప్ర‌మోష‌న్స్‌పై ఫోక‌స్ పెట్ట‌లేక‌పోతున్నార‌ని తెలుస్తుంది.జ‌గ‌ప‌తి బాబు విల‌న్‌గా న‌టించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చ‌ర్స్ వారు నిర్మించారు.ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌,ట్రైల‌ర్‌కు మంచి రెస్ప‌న్స్ వచ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -