Friday, April 26, 2024
- Advertisement -

ఆ వ్యాధితో బాధపడుతూ నవ్విస్తున్న జబర్ధస్త్ కమెడియన్

- Advertisement -

జబర్ధస్త్ షోలో ఇటీవల కొన్ని మార్పులు వచ్చాయి. నాగబాబుతో సహా కొందరు జబర్దస్త్ నుంచి మరో ఛానెల్ లో ప్రసారమయ్యే షోకి వెళ్లిపోయారు. అయినప్పటికి జబర్దస్త్ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఎప్పటిలానే నవ్వులు పంచుతుంది. అయితే, ఈ నవ్వులు పంచే ఆర్టిస్టుల వెనుక ఎన్నో కన్నీటి కథలు ఉన్నాయి.

ఈ షో ద్వారా పంచ్ ప్రసాద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతను ప్రాణాంతకమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకే చాలా కాలం షోకు దూరంగా ఉన్నాడు. ఈ విషయాన్ని అతడే పలుమార్లు వెల్లడించాడు. రీఎంట్రీలో తన ఆరోగ్యంపై తానే పంచులు వేసుకుంటూ నవ్విస్తున్నాడు. అతడి సమస్యను కొద్ది రోజుల క్రితం నాగబాబు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. అతడి వ్యాధి గురించి తెలిసిన రోజా, నాగబాబు సహా ఇతర ఆర్టిస్టులు కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు.

కానీ, అవి సర్జరీ మాత్రం చేయించుకునేందుకు సరిపోలేదు. దీంతో తరచూ డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు. కొన్ని సార్లు డయాలసిస్ సెంటర్ నుంచి నేరుగా షూట్‌కు కూడా వచ్చేవాడని తెలిసింది. ఇక ప్రసాద్ జబర్దస్త్ కు వచ్చిన కొత్తలో పలువురి స్కిట్లలో చేసేవాడు. తర్వాత వెంకీ మంకీస్ టీమ్‌లో సభ్యుడిగా పని చేసిన అతడు.. ఎన్నో స్కిట్లను ఒంటి చేత్తో లేపాడు. దాంతో పొట్టి నరేష్‌తో కలిపి ప్రసాద్ ను టీం లీడర్ ను కూడా చేశారు జబర్దస్త్ నిర్వహకులు. ఇక ప్రస్తుతం ప్రసాద్ జబర్దస్త్ వెంకీ మంకీ టీంలో కనిపిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -