Friday, April 26, 2024
- Advertisement -

దిల్ రాజు, మ‌హేశ్‌ల మ‌ధ్య గొడ‌వ‌లు?

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మహేశ్ బాబు న‌టిస్తున్న మ‌హ‌ర్షి సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం లండ‌న్‌లో జ‌రుగుతుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె న‌టిస్తుంది. ఈ సినిమాను దిల్ రాజుతోపాటు మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌లు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విష‌యంలో దిల్ రాజుకు, మ‌హేశ్ బాబుకు మ‌ధ్య చినపాటి గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని తెలుస్తుంది.

ఈ ఏడాది వరుస పరాజయాలతో నిర్మాత దిల్ రాజు డీలా పడ్డాడు. సాధారణంగా అతడి సినిమాలకి ఏవరేజ్ టాక్ వచ్చినా.. ప్రమోషన్స్ తో ఏదోకవిధంగా సినిమాను గట్టేక్కించేస్తాడు. కానీ ఈ ఏడాదిలో దిల్ రాజు ప్లాన్ ఒక్కటి కూడా వర్కవుట్ కాలేదు. దీంతో మ‌హేశ్ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు రూ.25 కోట్లకి అమ్మాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడు. హిందీ డబ్బింగ్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్మాలంటే.. సినిమాలో సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ కంటే యాక్షన్ ఎక్కువ శాతం ఉండాలి. కానీ ‘మహర్షి’ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు రెండు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది.

దిల్ రాజు.. దర్శకుడు వంశీ పైడిపల్లిని సినిమాలో మరికొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టాలని రిక్వెస్ట్ చేశారట. కానీ మహేష్ బాబు మాత్రం దానికి అంగీకరించడం లేదని తెలుస్తోంది. యాక్షన్ కథకి తగ్గట్లు ఉండాలని దానికోసం స్పెషల్ గా సీన్స్ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పాడట. మ‌రి ఇద్ద‌రిలో ఎవ‌రి మాట గెలుస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -