Friday, April 26, 2024
- Advertisement -

జాతీయ‌స్థాయిలో ప్ర‌భాస్‌, అనుష్క‌ల పెళ్లిపై అస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌..

- Advertisement -

టాలీవుడ్ హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి వ్యవహారం మరోసారి తెర‌పైకి వ‌చ్చింది. వీల్లిద్ద‌రూ ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నార‌నే వార్త‌లు చ‌క్క‌ల‌ర్లు కొడుతున్నాయి. ‘సాహో’ సినిమా పూర్తి కాగానే ప్రభాస్ పెళ్లి ప్రకటన ఉంటుందా…? అభిమానుల్లో నెల‌కొన్న క‌న్‌ఫ్యూజ‌న్‌కు త‌ర్వ‌ర‌లోనే తెర‌ప‌డ‌నుంద‌ని జాతీయ మీడియా కోడ‌డై కూస్తోంది.

వీల్లిద్ద‌రి పెళ్లి వార్త‌ల‌ను అనేక సార్లు ప్ర‌భాస్‌, అనుష్క ఖండించిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య‌న పుణ్యక్షేత్రాల దర్శనాల్లో బిజీగా ఉంది. మొన్నటి వరకు కేరళా, కర్ణాటకలో గడిపిన అనుష్క.. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని కేదర్‌నాథ్‌ ఆలయాన్ని కూడా దర్శించుకుంది. భాగ‌మ‌తి త‌ర్వాత అనుష్క సినిమాలు ఒప్పుకోలేద‌న్న సంగ‌తి తెలిసిందే.

సాహో’ షూటింగులో భాగంగా ప్రభాష్ విదేశాల్లో గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ దూరం వారిని మరింత దగ్గర చేరుస్తోందని జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ప్రభాస్ నిత్యం అనుష్కతో టచ్‌లో ఉంటున్నారని, వారిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారనే క‌థ‌నాలు బ‌లంగా వినిపిస్తున్నాయి.

ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు.. ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదిలోనే ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఊహాగానాల‌కు మ‌రింత బ‌లం చేకూరింది. మంచి స్నేహితులమని చెబుతున్న వీరిద్దరూ.. పెళ్లి చేసుకుంటే చూడముచ్చటగా ఉంటుందనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. మ‌రి కొద్ది రోజులు ఆగుతేగాని క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -