Friday, April 26, 2024
- Advertisement -

గోవాలో ఆ పని చేసి డబ్బంతా పోగొట్టుకున్నాను : శ్రీముఖి

- Advertisement -

శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులు ఈమెని రాములమ్మగా పిలుస్తారు. ముఖ్యంగా ’పటాస్’ షో ద్వారా బాగా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత బిగ్ బాస్ మూడో సీజన్ లోకి వెళ్లి అక్కడ రన్నర్ గా నిలిచింది. మాటల గారడీ చేస్తూ ఫాలోయింగ్ ను బాగా పెంచుకుంది. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడటం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెబుతూ అట్రాక్ట్ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి తాజాగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలు చెప్పి షాక్ ఇచ్చింది.

లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న సెలబ్రిటీలు పలు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో శ్రీముఖి మాట్లాడుతూ.. గోవాలో తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పింది. తనకు కసీనో గేమ్ అంటే చాలా ఇష్టమని.. ఆ గేమ్ వల్ల చాలా డబ్బు పోగొట్టుకున్నానని చెప్పింది. కసీనో గేమ్ మీద ఉన్న పిచ్చితో గోవా వెళ్లేదాన్నని, అదే తనకు చేదు అనుభవాలు మిగిల్చిందని ఆమె పేర్కొంది.

ఫస్ట్ టైం గోవా వెళ్లినప్పుడు కసీనో గేమ్ ఆడితే డబ్బులు వచ్చాయని, దాంతో రెండోసారి, మూడోసారి వెళ్లినప్పుడు కూడా అదే చేసి చేతులు కాల్చుకున్నానని శ్రీముఖి చెప్పింది. ఉన్న డబ్బంతా పోవడంతో అప్పటి నుంచి ఆ గేమ్‌కు దూరంగా ఉంటున్నానని తెలిపింది శ్రీముఖి. ఇక బుల్లితెరపై చేస్తూనే సిల్వర్ స్క్రీన్ జర్నీ కూడా చేస్తున్న శ్రీముఖి ప్రస్తుతం ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ సినిమాలో నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -