Saturday, April 27, 2024
- Advertisement -

సరిలేరు లో నాకే ఎక్కువ రెమ్యునరేషన్ – విజయశాంతి

- Advertisement -

విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటి. నలభై ఏళ్ల తన నట ప్రస్థానంలో అరవై మంది హీరోలతో కలిసి నటించారామె. తానే ఓ కథానాయకుడై సినిమాలను నడిపించారు. పదమూడేళ్ల విరామం తర్వాత ఆమె సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ అయింది.

ఈ చిత్రంలో తను పోషించిన భారతి పాత్ర గురించి, చిత్రంలో నటించిన అనుభూతుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. కొడుకు దిద్దిన కాపురం సినిమా చేస్తున్నప్పుడు మహేష్ చిన్న పిల్లవాడు. ఇప్పుడు సూపర్స్టార్ అయ్యాడు కదా ఎలా ఉంటాడో అనుకున్నా. కానీ తొలిరోజు అతను నాతో మాట్లాడిన తీరు, చూపించిన అభిమానం చూసి నా భయాలన్నీ పోయాయి. మహేష్ ఇచ్చిన సహకారం మర్చిపోలేను. ఆయన నా పాత్రకే కాదు, నన్నూ వెనకుండి సపోర్ట్ చేశారు.

మన దగ్గర పేరున్న దర్శకులకు అనిల్ తక్కువేమీ కాదు. మనస్ఫూర్తిగా చెబుతున్న, నలభై ఏళ్ల అనుభవమున్న నటిగా చెబుతున్నా. అనిల్ గొప్ప దర్శకుడు అవుతాడు. ఇప్పటిదాకా 60 మంది హీరోలతో కలిసి పనిచేశాను. నాతో కలిపి 61 మంది అనుకోండి, 90 దశకంలోనే నేను అత్యధిక పారితోషికం తీసుకున్నా. ఇప్పుడు అడగటం ఎందుకు. ఈ సినిమాలో హీరో తర్వాత నాదే ఎక్కువ పారితోషికం అని విజయశాంతి చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -