తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు లేవని, ఒకానొక సందర్భంలో తానే ఉద్యమం కోసం కేసీఆర్కు డబ్బులు ఇచ్చానన్నారు. అయితే ఉద్యమం సమయంలో కొంత డబ్బును డైవర్ట్ చేశారని, ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఆ విషయం బయటకు రాలేదన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు డబ్బుపై ఆశ పుట్టిందని.. ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాటగా జరుగుతోందని విజయశాంతి విమర్శించారు.
కొందరు నా గొంతు నొక్కేశారు
కాంగ్రెస్ పార్టీపై కూడా విజయశాంతి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు తన గొంతు నొక్కేశారని విమర్శించారు. ఉద్యమం నుంచి వచ్చిన మనిషిగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే విషయాలు చెబుతే ఎవరూ వినిపించుకోలేదన్నారు. తెలంగా రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని.. దానిపై పబ్లిక్లో మాట్లాడదామంటే ఎవరూ ఒప్పుకోలేదన్నారు. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. వాళ్లూ మాట్లాడలేదు.. తనని మాట్లాడనివ్వకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కళ్ల ముందు తప్పు జరుగుతున్నప్పుడు అది చెప్పడానికి వీలు లేకుండా పోయిందన్నారు. ఇలాంటి సమస్యలు కాంగ్రెస్ పార్టీలో చాలా ఉన్నాయని విజయశాంతి విమర్శించారు.
చంద్రబాబు, వైఎస్ జగన్లపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
ఫేక్ ట్వీట్ చేసి అడ్డంగా బుక్కైన చంద్రబాబు