Friday, April 26, 2024
- Advertisement -

రాజధాని మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ…

- Advertisement -

రాజధాని అమరావతి మార్పుపై బోత్సచేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. టీడీపీ నేతలు రెండు రోజులుగా నానా రాద్దాతం చేస్తున్నారు. తాజాగా వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాజధాని ఎక్కడికి తరలి పోవడంలేదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలంలో ఆయన పర్యటించారు.శివరామకృష్ణ కమిషన్ చెప్పిందే మంత్రి బొత్స చెప్పారని, రాజధానిని తరలిస్తున్నట్టు ఆయన చెప్పలేదని అన్నారు. ఏపీలో తాగునీటి కోసం కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని, సోమశిల జలాశయం నుంచి జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని చెప్పారు. పోలవరం పూర్తయితే సోమశిల జలాశయానికి నీటి కరవు ఉండదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -