తొలిసారిగా నవ్యాంధ్ర రాజధాని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ ఎటువంటి ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమ వేల భారీ సంబరాలకు బదులుగా, ప్రమాణస్వీకారోత్సవాన్ని చాలా నిరాడంబరంగా నిర్వహించాలన్నది జగన్ అభిమతం అని రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
అంగు ఆర్భాటాలు, ఆడంభారాలను పక్కన బెట్టి అభిమానులకు, వచ్చే అతిథుల సౌకర్యానికే పెద్ద పీట వేస్తున్నామని సీఎస్ తెలిపారు.లాంటి పాసులు లేనివాళ్లు కూడా 30,000 మంది వరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చని అన్నారు. స్టేడియంలో స్థలం అందుబాటులో లేని పక్షంలో, సమీప ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఎల్సీడీలను ఏర్పాటు చేశామన్నారు.
ఎక్కడా ఆడంబరాలకు తావులేని రీతిలోనే జగన్ అభీష్టానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎల్వీ చెప్పారు. ప్రమాణస్వీకారం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, జగన్, తాను ప్రధాన వేదికపై ఉంటామని, ముఖ్య అతిథులు ఉపవేదికపై ఉంటారని ఆయన వివరించారు