టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తేరుకోలేనన్ని షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు వస్తాయని బాబు కలలో కూడా ఊహించడు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కుటుంబం విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్నారు. పాపం పేరు విదేశీ పర్యటన అనే గాని చంద్రబాబుకు అక్కడ ఏ మాత్రం అంతట ప్రశాంతత దక్కలేదు. బాబు అటు విహార యాత్రలకు వెల్లడంతో ఇక్కడ పార్టీనుంచి నేతలు జంప్ అవుతున్నారు. ఇంతా చేసి విదేశాల నుంచి తిరిగి రాగానే ఇక్కడ ఏపీ సీఎం జగన్ చంద్రబాబుకు డబుల్ మరో షాక్ ఇచ్చారు.
ఇప్పటికే ఉండవల్లిలోని పర్యావరణ నిబంధనలకు విరుద్దంగా కట్టిన ప్రజావేదిక భవనాన్ని కూల్చేయాలని ఇప్పుటికే జగన్ ఆదేశాలు జారీచేసిన జగన్ బాబు ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీ సమావేశాలకు ముందు భద్రత తగ్గించిన ప్రభుత్వం… ఇప్పుడు వారి ఫ్యామిలీకి కూడా కల్పించే సెక్యూరిటీని కుదించారు. జడ్ కేటగిరీ ఉన్న లోకేష్ కు 5 ప్లస్ 5నుంచి… 2 ప్లస్ 2 గన్ మెన్ల కు భద్రత తగ్గించింది. మిగిలిన కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు కల్పిస్తున్న భద్రతను పూర్తిగా తొలగించింది.
ఫారిన్ నుంచి ఏపీ లో అడుగుపెట్టిన చంద్రబాబు ఫ్యామిలీ కి ఎయిర్పోర్టులోనే ఈ సెక్యూరిటీ షాక్ తగిలింది. చంద్రబాబు ఫ్యామిలీకి సెక్యూరిటీ తగ్గించడం పై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఇలా సెక్యూరిటీని ఎలా తగ్గిస్తారని ప్రశ్నిస్తున్నారు. పాదయాత్ర సమయంలో కూడా భద్రతను పెంచారే కానీ తగ్గించలేదంటున్నారు. ఇదంతా కక్షసాధింపు చర్యలని నేతలు మండిపడుతున్నారు.