రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ చాలా సఖ్యతతో మెలుగుతున్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలపై అవగాహనతో ముందుకెల్తున్నారు.ఇద్దరు సీఎంలు ఎప్పుడు కలిసినా సంచలనమే. గతంలో ఇద్దరు సమస్యలను చర్చించడానికి ఒకే వేదికను పంచుకున్నారు. తాజాగా ఇప్పుడు మరో సారి ఒకే వేదిక మీద కలవనున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి త్వరలోనే ఓ క్రేజీ మ్యారేజ్కు హాజరు కానుండడం కాస్త ట్రెండింగ్గా మారింది.
అసలు విషయానికి వస్తే..తెలంగాణలో యువ ఐపీఎస్ అధికారిణి చందన దీప్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాల యువతను ఉద్దేశిస్తూ సందేశాలు పెడతూ ఫాలోయింగ్ తోపాటు మంచి పేరుతెచ్చకున్నారు.ఇటీవలే ఎస్పీ చందన దీప్తికి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. అక్టోబర్లో ఆమె పెళ్లి వేడుక హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా తన పెళ్లికి హాజరు కావాలని చందన దీప్తి తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆహ్వానం పలికారు.
అక్టోబర్లో జరిగే ఈ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది.ఎందుకంటే చందనదీప్తికి కాబోయే భర్త జగన్మోహన్రెడ్డికి సమీప బంధువు. అతడు ఏపీలోని జగన్ సొంత జిల్లా కడప జిల్లాకు చెందిన వ్యక్తే. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్య అభ్యస్తిస్తోన్న చందన దీప్తికి కాబోయే భర్త పెళ్లి తర్వాత బిజినెస్ రంగంలో స్థిరపడే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. చందన దీప్తి వివాహం సందర్భంగా మరోసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించనున్నారు.