Friday, April 26, 2024
- Advertisement -

కాకినాడలో కుంగిన అపార్ట్ మెంట్…పరుగులు తీసిన జనాలు..

- Advertisement -

కాకినాడలో ఐదు అంతస్తుల అపార్ట్ మెంట్ కు బీటలు పారి ఫిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి.భాస్కర్ ఎస్టేట్స్ అపార్ట్ మెంట్ లో మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి. అపార్టు మెంట్ వెనుక భాగంలో మూడు పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. కుంగిన పిల్లర్లకు తాత్కాలికంగా కర్రలను సపోర్ట్ గా పెట్టారు. ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.దీంతో, అపార్టుమెంట్ వాసులు భయాందోళనలకు గురయ్యారు.

స్థానిక దేవీ మల్టీప్లెక్స్ సమీపంలో పదమూడేళ్ల క్రితం ఈ అపార్టుమెంట్ ను నిర్మించారు. ప్రామాణాలు పాటించకపోవడంతో ఇలాంట పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అందులో ఉన్న 40 కుంటుంబాలను ఖాలీ చేయించారు. తమ ఇళ్లలో ఉన్న సామానులు బయటకు తెచ్చుకొనేందుకు భయపడుతున్నారు.కూలేందుకు సిద్ధంగా ఉన్న బిల్డింగ్ ఐదు అంతస్తులు ఉండడంతో పక్కనే ఉన్న భవనాలు కూడా ఖాళీ చేయిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -