ప్రముఖ ఈ- కామర్స్ సంస్థలయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు భారీ డిస్కౌంట్తో కూడిన డీల్స్ను తాజాగా ప్రకటించాయి. 2019 2019 ఏడాదికి సంబంధించి ఫ్లిప్కార్ట్లో మళ్లీ రిపబ్లిక్ డే సేల్ షురూ కానుంది. జనవరి 20నుంచి 23వరకు ఆఫర్ సేల్ నిర్వహించబోతోంది ఫ్లిప్కార్ట్.
ఇక అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ఈ నెల 20 నుంచి 23 వరకు ఆఫర్లు ప్రకటించింది. వినియోగదారులకు ఈ డీల్స్ ఈ నెల 20వ తేదీ నుంచి అందుబాటులోకి రానుండగా అమెజాన్ ప్రైమ్ సభ్యులకు, ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు ఈ నెల 19 నుంచే ఈ ఆఫర్లు లభిస్తాయి.
ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, టీవీలు, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బొమ్మలు లాంటి కేటగిరీల్లో ఆకర్షణీయమైన ఆఫర్లు కొనుగోలుదారులను ఊరించనున్నాయి. షావోమీ, హానర్, ఏసుస్, రియల్మీ స్మార్ట్ఫోన్లు, టీవీలపై మంచి ఆఫర్లు లభ్యం కానున్నాయి.
ఈ సేల్లో భాగంగా అమెజాన్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డు వాడి కొనుగోళ్లు జరిపే వారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ సేల్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి షాపింగ్ చేసేవారికి 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ఎలకా్ట్రనిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను ఈ రెండు సంస్థలు ప్రకటించాయి.
ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్పై 80శాతం వరకు, టీవీలు, అప్లయెన్సెస్పై 75 శాతం వరకు, ఫ్లిప్కార్ట్ బ్రాండ్స్పై 70 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాదు 3 వస్తువులు కలిపి కొంటే 10శాతం, 4 వస్తువులు కలిపి కొంటే 15 శాతం తగ్గింపు ఆఫర్లున్నాయి.
మరో వైపు కొన్ని మోడళ్లపై వడ్డీ లేకుండా నెలసరి వాయిదాల చెల్లింపు పద్ధతి కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్లో ఐ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో వన్ ప్లస్ 6టి, రెడ్మి వై2, హువాయ్ నోవె 3ఐ, హానర్ 8ఎక్స్ స్మార్ట్ ఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.