Friday, April 26, 2024
- Advertisement -

ప్రియుడిమోజులో ప‌డి… భ‌ర్త‌ను పైలోకాల‌కు పంపిన న‌వ వ‌ధువు

- Advertisement -

వివాహేత‌ర సంబంధాల వ‌ల్ల స‌మాజంలో రోజు రోజుకీ నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. దీని వ‌ల్ల ప‌చ్చ‌ని కుటుంబాల్లో విషాద ఛాయ‌లు అలుముకుంటున్నాయి. తాజాగా ప్రియుడి మోజులో ప‌డి పెళ్లైన రెండు వారాల‌కే భ‌ర్త‌ను అతి కిరాత‌కంగా చంపించింది.తనను నమ్మి పెళ్లి చేసుకున్న భర్తను అనంత లోకాలకు సాగనంపింది.పెళ్లికి రెండేళ్ల నుంచి ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న యువతి పెళ్లి కావడంతో తన ప్రేమాయణానికి భర్త అడ్డు అని భావించింది. ప్రియుడితో కలిసి ఉండలేనని భావించి అతడితోనే భర్తను హత్య చేయించింది. వారం రోజుల త‌ర్వాత కేసును ఛేదించిన పోలీసులు ప్రియుడ్ని, వివాహిత‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు అధికారులు.తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటనే చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెల్తే….తూర్పుగోదావరి జిల్లా కరపకు చెందిన పేకేటి సూర్యనారాయణకు 28 ఏళ్లు. ఎంఎస్సీ చదవి… మండపేటలోని శ్రీవికాస జూనియర్‌ కళాశాల్లో లెక్చరెర్‌గా పనిచేస్తున్నాడు.మే 15న కరప శివారు గ్రామం పేపకాయలపాలెం వాసి మద్దూరి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మితో సూర్యనారాయణకు వివాహం జరిపింది. వారం రోజులు బాగానె గ‌డిచింది. ఇంత‌లోనె ఏమ‌య్యిందో ఏమో గాని అకస్మాత్తుగా రాత్రి ఇంటి నుంచి బయటకెళ్లిన సూర్యనారాయణ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసవారు అతని తల్లిదండ్రులు.

దీంతో కేసున ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు వారంరోజుల్లో నె చేదించారు. కాకినాడ రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించిన పోలీసులు గ్రామంలో పలువురిని విచారించగా నాగలక్ష్మికి రాధాకృష్ణ అనే వ్యక్తితో ఉన్న అక్ర‌మ‌ సంబంధం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఈనెల 21న మధ్యాహ్నం సూర్యనారాయణ అత్తవారింటి నుంచి కరపకు వచ్చి అదేరోజు సాయంత్రం తిరిగి వేపకాయపాలెం వెళ్లారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో బయటకు వెళ్తూ ఎనిమిదింటికల్లా తిరిగివస్తానని భార్యతో చెప్పిన ఆయన అప్పటి నుంచీ కనిపించకుండా పోయారు. కుటంభ‌స‌భ్యులు ఎంత వెతికినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో నాగ‌ల‌క్ష్మి ప్రియుడు రాధాకృష్ణ‌పై అనుమానంతో పోలీసులు త‌న దైన శైలిలో విచారించ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.తమ వివాహేతర బంధానికి అడ్డులేకుండా సూర్యనారాయణను అంతంచేయాలని నాగలక్ష్మి కోరడంతోనే తానీ హత్య చేశానని రాధాకృష్ణ అంగీకరించాడు.

నిందితుడు రాధాకృష్ణ సూచనల మేరకు ఈ నెల 22వ తేదీన ఉదయం పెనుగుదురు- పాతర్లగడ్డ రహదారిలో పంటపొలంలో సూర్యనారాయణ మృతదేహం లభించింది. సూర్యనారాయణను హత్య చేసి తలపై గడ్డి కప్పి ఉంచారు. సూర్యనారాయణను చంపాలని ప్రియుడు రాధాకృష్ణను నాగలక్ష్మి కోరింది. దీంతో రాధాకృష్ణ సూర్యనారాయణ హత్య చేశాడు.నిందితులు రాధాకృష్ణ, నాగలక్ష్మిలను అరెస్టు చేశారు. హతుడి వద్ద దొంగిలించిన బంగారు ఆభరణాలు, కత్తి, మరో ఆయుధం గురువారం స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -