Saturday, April 27, 2024
- Advertisement -

పెళ్లి విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న మైనర్ బాలిక…

- Advertisement -

రెండేళ్లు ఆగితే ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పినప్పటంతో తీవ్ర మరస్థాపానికి గురయిన మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. సారీ…మమ్మీ..డాడీ అంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో చోటు చేసుకుంది.

వివరాల్లో వెల్తే….చాంద్రాయణగుట్ట పరిధిలో నివాసం ఉండే ఓ బాలిక(16) పదో తరగతి చదువుతోంది. స్థానిక యువకుడు ఒకరిని ఆమె ప్రేమించింది. విషయం తల్లిదండ్రులకు కూడా చెప్పి.. అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనికి సరేనన్న తల్లిదండ్రులు మైనర్ కావడంతో మరో రెండేళ్లు ఆగాలని సూచించారు.

తల్లిదండ్రుల మాటలను కాదని, ఈ నెల 20న మధ్యవర్తి ద్వారా ఓ ఖాజీని కలిసి విషయం చెప్పి పెళ్లి చేయమని కోరింది. అతడు కూడా బాలిక తల్లిదండ్రులు చెప్పినట్టుగానే మైనర్ కాబట్టి తానా పని చేయలేనని, రెండేళ్లు ఆగాలని హితవు పలికాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురియన బాలిక బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

రెండేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమని, ప్రేమించిన యువకుడితో పెళ్లి అవుతుందో, కాదో తెలియని.. అందుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది. చివర్లో సారీ డాడీ.. సారీ మమ్మీ అని రాసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -