Friday, April 26, 2024
- Advertisement -

చిన‌బాబు నెటిజ‌న్ల‌కు మ‌ళ్లీ దొరికాడు….లోకేష్ భ‌ర్త చంద్ర‌బాబునా…..?

- Advertisement -

టీడీపీ అధినేత బాబు పుత్ర ర‌త్నం పార్టీ భావి సార‌ధి నారాలోకేష్ రాజ‌కీయ ప‌రిజ్ణానం బాబుకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కొడుకును సీఎంగా చూసుకోవాలన్న బాబు ఆశ‌ల‌కి లోకేష్ గండికొడుతున్నారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో దిగిన లోకేష్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌ర‌మానంద‌య్య శిష్యుల‌ను మ‌ర‌పిస్తున్నారు. లోకేష్‌ ఏ బహిరంగ సభలో మాట్లాడినాపొరపాటున ఏదో ఒకటి మాట్లాడేసి పార్టీని ఇరుకున పెడుతుంటారు. అందుకే ఆయ‌న మాట్లాడుతున్నారంటె పార్టీనేత‌లు భ‌య‌ప‌డుతుంటారు. ఆవేశంగా మాట్లాడ‌టం నెటిజ‌న్ల‌కు వెంట‌నే చిక్క‌డం చిన‌బాబుకు అల‌వాటుగా మారింది.

మంగ‌ళ‌గిరి ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే పరవశించిపోయాం అంటూ కామెంట్స్ చేసి ఇరుక్కుపోయాడు. మంగ‌ళ‌గిరి అని అన‌కుండా మంద‌ల‌గిరి అని మ‌రో సారి ప‌ప్పులో కాలేశారు. అంతేనా 9 వ తేదీన అంద‌రూ టీడీపీకీ ఓట్లు వేయాల‌ని పిలుపునిచ్చారు. ఇంకే ముంది నెట‌జ‌న్లు సామాజిక మాధ్య‌మాల్లో ఓ ఆట ఆడుకున్నారు.

తాజాగా మ‌రో సారి అడ్డంగా దొరికిపోయారు లోకేష్‌. ఈసారి బ‌హ‌రంగ స‌భ‌ల్లో కాదులేండి. ఎన్నికల అఫిడవిట్‌లోనూ తప్పు చేసి నవ్వుల పాలయ్యారు. శుక్రవారం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి లోకేష్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల అఫిడవిట్ లో మరోసారి లోకేష్ మిస్టేక్ చేశారు. భర్త పేరు అని రాసి ఉన్న చోట తన తండ్రి చంద్రబాబు పేరు రాయడం విశేషం. లోకేష్ తన తండ్రి పేరు రాయడం మరింత విచిత్రం. కాగా.. ఆ అఫిడవిట్ పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -